Posted on 2025-09-15 10:31:00
ప్రజావాణిలో పురుగుల మందు తాగిన వృద్ధుడు
కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విఠల్ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి ఆయనను తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తన కొడుకు నరేష్ తమని పోషించడం లేదని విఠల్ భార్య వీరవ్వ ఆరోపిస్తోంది. కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తమను చంపుతానని బెదిరిస్తున్నాడని, పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో మాట్లాడిన తమకు న్యాయం జరగడం లేదని వృద్ధురాలు వాపోతోంది.
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >