Posted on 2025-09-15 14:01:00
ప్రజావాణిలో పురుగుల మందు తాగిన వృద్ధుడు
కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విఠల్ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి ఆయనను తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తన కొడుకు నరేష్ తమని పోషించడం లేదని విఠల్ భార్య వీరవ్వ ఆరోపిస్తోంది. కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తమను చంపుతానని బెదిరిస్తున్నాడని, పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో మాట్లాడిన తమకు న్యాయం జరగడం లేదని వృద్ధురాలు వాపోతోంది.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >