Posted on 2025-09-15 13:28:08
పదేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న ఓ వికలాంగుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నవిపేట మండలం మద్దెపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు పింఛన్ కోసం తన భార్య సహాయంతో సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. తాను గత పదేళ్లుగా పక్షవాతం వ్యాధితో పింఛన్ కోసం తిరుగుతున్నానని కానీ పింఛన్ రాకపోవడంతో తమ జీవనం రోజురోజుకు దీనంగా మారుతుందని దీనంగా మారుతుందని తన భార్య కూలి పని చేస్తే తప్ప వేరే ఆధారం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు పింఛన్ కోసం తిరిగిన ఒక్క రూపాయి రాలేదని కనీసం స్లాట్ బుక్ కూడా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్లాట్ బుక్ అయినా గాని పింఛన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వ్యవహరిస్తున్నారని కనీసం మీరైనా పట్టించుకోని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ప్రాధేయపడ్డారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >