Posted on 2025-09-15 09:57:13
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల ధర్నా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న స్కూల్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సోమవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్న ఇంతవరకు పేద విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, స్కూల్ మెంబర్స్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు మధ్యలోనే వారి చదువును ఆపాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడిని చేపట్టనున్నారని పిలుపుమేరకు పోలీసులు నిజామాబాద్ నగరంలోని బోధన్ ఎమ్మెల్యే నివాసం వద్ద, కంటేశ్వర్ బైపాస్ లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంటి వద్ద, అదేవిధంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మా ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >