Posted on 2025-09-15 13:26:45
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల ధర్నా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న స్కూల్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సోమవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్న ఇంతవరకు పేద విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, స్కూల్ మెంబర్స్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు మధ్యలోనే వారి చదువును ఆపాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడిని చేపట్టనున్నారని పిలుపుమేరకు పోలీసులు నిజామాబాద్ నగరంలోని బోధన్ ఎమ్మెల్యే నివాసం వద్ద, కంటేశ్వర్ బైపాస్ లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంటి వద్ద, అదేవిధంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మా ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >