Posted on 2025-09-15 12:20:01
రైతులు ఆందోళన చెందవద్దు
ఇంకా యూరియా సరఫరా అవుతుంది..
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డైలీ భారత్, బోయినపల్లి: జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. బోయినపల్లి మండలం కొదురుపాక లోని రైతు వేదికలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టోకెన్ పద్ధతి, ఎరువుల పంపిణీ పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఆయా పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామని స్పష్టం చేశారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని తమ మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు.
రైతులు తమకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా.. ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >