| Daily భారత్
Logo




ఇటీవల వరద బీభత్సంతో నష్టపోయిన బోధన్ నియోజకవర్గ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

News

Posted on 2025-09-15 12:12:24

Share: Share


ఇటీవల వరద బీభత్సంతో నష్టపోయిన బోధన్ నియోజకవర్గ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిసిన బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి  మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బోధన్ నియోజకవర్గంలోని సాలూర మంజీరా పరివాహక ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలైన రైతులకు అదేవిధంగా కందకుర్తి గోదావరి సరిహద్దు గ్రామాలైన నీలా, బోర్గాం, తాడి బిలోలి, రెంజల్, నవీపేట్ లోని కొన్ని ప్రాంతాల గ్రామాల రైతులు వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెండో పంటకు విత్తనాలను వెంటనే ప్రభుత్వం సరఫరా రైతులకు అందివ్వాలి అన్నారు . వరద ప్రభావానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ఆయన కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు వరద ప్రభావానికి దెబ్బతిన్న రైతులకు ఎకరానికి ప్రభుత్వం 30,000 ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కష్టపడి పంట పండించే రైతులకు ఇన్సూరెన్స్ లేకపోవడం అన్యాయం అన్నారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >