Posted on 2025-09-15 12:12:24
రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిసిన బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బోధన్ నియోజకవర్గంలోని సాలూర మంజీరా పరివాహక ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలైన రైతులకు అదేవిధంగా కందకుర్తి గోదావరి సరిహద్దు గ్రామాలైన నీలా, బోర్గాం, తాడి బిలోలి, రెంజల్, నవీపేట్ లోని కొన్ని ప్రాంతాల గ్రామాల రైతులు వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెండో పంటకు విత్తనాలను వెంటనే ప్రభుత్వం సరఫరా రైతులకు అందివ్వాలి అన్నారు . వరద ప్రభావానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ఆయన కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు వరద ప్రభావానికి దెబ్బతిన్న రైతులకు ఎకరానికి ప్రభుత్వం 30,000 ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కష్టపడి పంట పండించే రైతులకు ఇన్సూరెన్స్ లేకపోవడం అన్యాయం అన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >