| Daily భారత్
Logo




అటవీశాఖ ఉద్యోగిని పై దాడి చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

News

Posted on 2025-09-04 16:47:32

Share: Share


అటవీశాఖ ఉద్యోగిని పై దాడి చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు రేంజ్ పరిధిలోని, పాపకొల్లు బీట్- బీ పరిధిలోగల  రాసగానిగుట్ట కంపార్ట్మెంట్ నెంబర్ 31  ప్రాంతంలో,తేదీ 29.08. 2025న  ఉదయం 11.00 గంటల సమయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన కొలిచలం విజయలక్ష్మి మరియు ప్లాంటేషన్ వాచర్ అయిన తేజావత్ రాము కలిసి విధులు నిర్వహిస్తుండగా, అట్టి ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మారుజాతి మొక్కలను నరికి వేసి ఉండడాన్ని గమనించినారు, అయితే అట్టి ప్రదేశము ఫారెస్ట్ కవర్ రేంజ్ పాయింట్ కనుక అట్టి ప్రదేశంలో మొక్కలు నాటవలసి యున్నది కనుక,పై అధికారుల ఆదేశానుసారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వాచర్ లు ఇద్దరు కలిసి మొక్కలు నాటుచుండగా, మొక్కలు నాటుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడి సీతారాములు,మడి ప్రవీణ్,మడి ముత్తమ్మ లు అచ్చటకు వచ్చి మొక్కలు నాటడానికి వీల్లేదు, ఇచట గుత్తి కోయలు ఇలానే చెట్లను నరికి సాగు చేసుకుంటారు, మీరు అడ్డు చెబితే మీ సంగతి చూస్తాం, మిమ్ములను చంపుతామంటూ బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి, మొక్కలు నాటకుండా అడ్డగించి, విధులకు ఆటంకం కలిగించినారని, పక్కనే ఉన్న గుత్తి కోయ మహిళ అయిన మడివి హీడిమా ను రెచ్చగొట్టి, తనపై దాడికి ఉసిగొల్పినాడని, సదరు మహిళ రాయితో తన ను రెండు దెబ్బలు గట్టిగా కొట్టి ,జుట్టు పట్టుకొని లాగి కింద పడేసిందని, తమ వాచర్ వీడియో చిత్రీకరిస్తుంటే, వారంతా వాగు దాటి పారిపోయారని, కాసేపటికి బచ్చల నరసమ్మ అనే మహిళ కూడా తమ వద్దకు వచ్చి, దురుసుగా ప్రవర్తించి ,అసభ్య పదజాలంతో దూషించి, చంపుతా అంటూ బెదిరించినదని, అటవీ శాఖ వారి అనుమతి లేకుండా ,అటవీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, 15 వేల రూపాయల విలువ చేసే చెట్లను నరికి, పత్తి పంట సాగు చేసుకుంటూ, ఎందుకు ఇలా అనుమతి లేకుండా పంటలు వేశారని ప్రశ్నించినందుకు, తమను బూతులు తిట్టి రాళ్లతో కొట్టి గాయపరిచి, మొక్కలు వేయనీయకుండా తమ విధులకు ఆటంకం కలిగించి, మరో మారు తమను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన, మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ , హీడిమా, నరసమ్మలపై చట్టరీత్య చర్య కొరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలిచలం విజయలక్ష్మి, భర్త పేరు మాధరావు, వయసు 30 సంవత్సరములు, అను ఆమె ఫిర్యాదు ఇవ్వగా, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >