Posted on 2025-09-04 18:44:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో మంచాల శంకరయ్య టేబుల్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ భక్తులకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. భక్తి మార్గంలో సత్యం, ధర్మం, కర్మ మార్గం, ఆధ్యాత్మికతను చాటి చెప్పే గ్రంథాన్ని అందుకోవడం భక్తులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా భక్తులు ట్రస్ట్ చైర్మన్ జ్ఞానేందర్ను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞానేందర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో ధార్మిక విలువలు, ఆధ్యాత్మిక ఆచరణలు కొనసాగాలని ఆకాంక్షించారు. భగవద్గీతలోని సూత్రాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >