Posted on 2025-08-12 20:02:39
దేశ సమైక్యత కోసం నేటి తరం యువత పాటుపడాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జాతీయ సమైక్యతను చాటేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని గాంధీచౌక్ నుంచి బస్టాండ్ మీదుగా తిలక్ గార్డెన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా ర్యాలీలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం చేయడంలో సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు ఇచ్చే గౌరవమే తిరంగా ర్యాలీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15కు ముందు "హర్ ఘర్ తిరంగా" అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ర్యాలీలో విద్యార్థులు ప్రదర్శించిన భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, పాల్గొన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >