Posted on 2023-12-22 14:54:57
మూషం రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఆప్రజాస్వామికంగా పార్లమెంటు నుండి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో జరిగిన పొగ బాంబు ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో ఈ విషయంపై చర్చకు పట్టుబడిన 141 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ లో తన మంద బలం చూసుకొని నిరంకుశంగా , నియంతృత్వ ధోరణితో పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకొని ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి , కోడం రమణ , జవ్వాజి విమల , గురజాల శ్రీధర్ , రామంచ అశోక్ , ఎలిగేటి రాజశేఖర్ , మల్యాల నర్సయ్య , నక్క దేవదాస్ , దాసరి రూప , బెజుగం సురేష్ , మోర తిరుపతి , పోచమల్లు , సంపత్ , బాబు తదితరులు పాల్గొన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >