Posted on 2026-04-24 16:36:30
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
డైలీ భారత్, న్యూఢిల్లీ: రాఘవ్ చద్దా సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాఘవ్ చద్దా తన రాజీనామా అనంతరం మాట్లాడుతూ “ఇంతకాలం నేను తప్పు పార్టీలో ఉన్నాను. దేశ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న బీజేపీతో కలిసి పనిచేయాలనిపించింది” అని పేర్కొన్నారు.
ఇక ఆయనతో పాటు Sandeep Pathak, Ashok Mittal కూడా ఆప్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామా ఆప్కు భారీ దెబ్బగా భావిస్తున్నారు.
ఇదే సమయంలో మొత్తం ఏడుగురు ఎంపీలు ఆప్ను వీడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంట్లో ఆప్ బలం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ పరిణామాలపై స్పందించిన బీజేపీ నాయకత్వం, “దేశాభివృద్ధి కోసం పనిచేయాలనుకునే వారికి మా పార్టీ ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంటుంది” అని పేర్కొంది.
మరోవైపు, ఆప్ నాయకత్వం ఈ పరిణామాలను “ద్రోహం”గా అభివర్ణిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మోసం చేశారని విమర్శించింది.
ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
- ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దా భారీ షాక్..
- బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన..
- ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు కూడా..
- మొత్తంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్..
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చద్దాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు మొత్తంగా ముగ్గురు ఎంపీలు ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిఠల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తన సూత్రాల నుంచి పక్కకు తప్పుకుందని, మూడింట రెండు వంతు ఎంపీలతో బీజేపీలో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ, బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది బీజేపీలో విలీనం కానున్నారు. బీజేపీలో విలీనం అవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ వంటి వారు ఉన్నారు. నా జీవితంలో 15 ఏళ్లుగా ఆప్కు సేవ చేశానని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశానని, ఇప్పుడు ఆప్ వాటికి దూరమైందంటూ చద్దా విమర్శించారు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి, ప్రజలకు చేరువవుతున్నట్లు వెల్లడించారు.
ఇటీవల పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ చద్దాను తొలగించింది. దీంతో పార్టీకి ఆయనకు మధ్య తీవ్ర దూరం ఏర్పడింది. ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మాట్లాడుతూ.. బీజేపీలో చేరేందుకు రాఘవ్ చద్దా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నట్లు ఆరోపించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. చివరకు ఈ ఆరోపణలే నిజమయ్యాయి.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >