Posted on 2023-12-22 10:46:41
డైలీ భారత్, హైదరాబాద్:ఎర్రమంజిల్ సమీపంలో ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో అందులో నివసిస్తున్న కొంత మంది తప్పించుకుని బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు.
లోపలి చిక్కుకున్న పలువుర్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్.. పెను సాహసమే చేశారు. తన ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని మంటల నుంచి కాపాడారు.
ప్రమాదం జరిగి అరగంట దాటిపోయిన ఫైర్ ఫైరింజన్ చేరుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శ్రావణ్ ధైర్యం చేశాడు. లోపలికి ప్రవేశించి చాకచాక్యంగా ఓ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు.
దీంతో కానిస్టేబుల్ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినదించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామ్ రెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్లు సైతం శ్రమించి బాధితులను రెస్కు చేశారు..డంబెళ్ల సాయంతో కిటికీలను పగలగొట్టి వారిని బయటికి తెచ్చారు.
కాగా, ప్రమాదానికి షాక్ సర్కిట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >