Posted on 2025-08-10 21:31:07
కార్యాలయంలో ఉన్నత అధికారులు లేక లక్షల్లో ఉన్న పెన్షన్ పెండింగ్ ఫైళ్లు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న పి ఎఫ్ కార్యాలయంలో అసలైన ఉన్నతాధికారులు లేక ఏళ్ల తరబడిగా లక్షలాదిగా పెన్షన్ కు సంబంధించిన ఫైళ్లు పడి ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని అప్పటి ఎంపీ దివంగత నేత కేశ్ పల్లి గంగారెడ్డి హయాంలో ఆయన ప్రత్యేక చోరవతో జిల్లాలో ప్రారంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు జిల్లాల్లో ఉన్న పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో ఉద్యోగుల భర్తీ విషయంలో విముఖత చూపుతున్నారని విషయం తేటతెల్లమవుతుంది. ఈ కార్యాలయంలో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ తో పాటు, సూపరిండెంట్లు, ఏవో, మిగతా అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీనివల్ల ఆధార్ లింకు సమస్య ఏర్పడడంతో లక్షకు పైగా పింఛన్ ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే బీడీ కార్మికులు, ఇతర ఉద్యోగులు ఎక్కువగా ఉన్న మన జిల్లాలో ఏళ్ల తరబడిగా పెన్షన్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఎంపీ ప్రాంతీయ కార్యాలయం పై ప్రత్యేక దృష్టి వహించి కార్యాలయంలో ఉన్నతాధికారులు ను నియమించే విషయంలో శ్రద్ధ వహించి కేంద్ర కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి ఏళ్ల తరంగా పెన్షన్ కోసం వేచి చూస్తున్నా పెన్షన్ దారులు ఎంపీని విన్నవిస్తున్నారు. వృద్ధాప్య సమయంలో పెన్షన్ దారులకు పెన్షన్ రాకపోవడంతో తాము బతికేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >