Posted on 2025-08-10 21:32:42
ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈ డబ్ల్యూ ఎస్ ను అన్ని రంగాల్లో అమలు చేయాలని ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. అగ్రవర్ణాల పేదల బతుకులు మారేదెప్పుడు, ప్రభుత్వాలు మారిన మా అగ్రవర్ణ పేదల బతుకులు మారలేదన్నారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలు. మా పరిస్థితి రోజు రోజు కి అన్ని రకాలుగా దిగజారిపోతోందని తెలిపారు. అన్యాయం అయిపోతున్న బతుకులు మావి.. ఈ రోజుల్లో మా అగ్రవర్ణాల ప్రజలకి అడుగడుగున అవమానాలు అన్యాయాలు తప్ప మాకు ఓరిగింది ఏమి లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ లేక ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక మా యువతి యువకులు బతుకులు ఆగం అవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కూడా రాష్ట్ర లో పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ రంగ ఉద్యగాలలో రిజర్వేషన్ ను పాటించటం లేదన్నారు. కింది స్థాయిలో కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >