Posted on 2025-08-10 20:19:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మాల కాలనీలో ఆదివారం ముత్యాలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ముత్యాలమ్మ తల్లికి చీరలు, సారెలు, గాజులు, పండ్లు సమర్పించి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని తల్లిని ప్రార్థించారు.
మేళతాళాల నడుమ కోళ్లు, మేకలు, బోనాలు సమర్పించగా కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాల కాలనీ గ్రామ పెద్దలు మంద నరసయ్య, మంద పుల్లయ్య, జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, యూత్ కల్లోజి దినేష్, సభ్యులు పాల్గొన్నారు.
పానితి కృష్ణవేణి, బరగడ రాణి, బరగడ రమేష్, కల్లోజి జ్యోతి, శ్రీలత, వేంూరి రాణి, రాణి, గంపాల సునీత, సమంధాల మహాలక్ష్మి, కల్లోజి రాజిని, మంద నర్సయ్య, కల్లోజి పకీరు, కల్లోజి రామస్వామి, కల్లోజి వెంకట్, పసుపులేటి పవన్ తదితరులు పండుగలో పాల్గొన్నారు.
కాలనీ ఏకత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాలు, బోనాలు సమర్పించి తల్లి దీవెనలతో పండుగను ముగించారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >