Posted on 2025-08-06 18:05:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్రం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో చైతన్యపరిచి ఉద్యమాలకు లేపారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగే న్యాయం అభివృద్ధిపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన ఘనత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ దేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉన్నంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని ఆయన కొనియాడారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఆయన పోరాడి సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మిరియాల సురేష్ కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రేఖా ప్రసాద్ తో పాటు సంఘం కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >