Posted on 2025-08-06 18:01:58
ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు నిందుతుడు ఫోన్ కాల్స్
హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ నిందుతుడు మోసాలు
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలసి NCRP పోర్టల్ 79 పిటీషన్లలో సుమారుగా 60 లక్షల రూపాయల వరకు మోసాలు.
నిందుతుణ్ణి హైదరాబాద్ లో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్.
వివారలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా చెందిన వ్యక్తి బాధితులకు ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు కాల్స్ చేస్తు హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి బాధితులకు మొబైల్ నుండి కాల్ చేసి వారిని ఒక లింక్ పంపించి ఆ లింకు ఓపెన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అని చెప్పాగా బాధితులు నమ్మి ఆలింక్ క్లిక్ చేసి లింక్ లో UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోవడం జరిగింది. దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో రాజిరెడ్డి అనే బాధితునికి మరియు వేములవాడ టౌన్ పరిధిలో ఒక బాధితుడికి నేరస్థుడు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా బాధితుల నమ్మి UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఒకరు ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి 46 వేల రూపాయలు,10000 రూపాయలు నష్టపోవడం జరుగగా రాజిరెడ్డి పిర్యాదు మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల సిరిసిల్ల రూరల్ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా ఈరోజు హైదరాబాద్ నిందుతుణ్ణి అరెస్ట్ చేయడం జరిగిందని,నిందుతుడు సలీం మాలిక్ పైన రెండు తెలుగు రాష్ట్రాలలో 79 పిటిషన్ లలో సుమారుగా 60 లక్షల రూపాయల వరకు మోసాలకు పాల్పడటం జరిగిందని నిందుతుణ్ణి ఈ రోజు రిమాండ్ చేయడం జరిగిందన్నారు.
నిందుతుని వివారలు.
1.ముల్లుంటి సలీం మాలిక్,age 32,భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >