Posted on 2025-08-06 16:01:35
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో కోతలు లేని కరెంట్ ఇవ్వాలని, ఒకవేళ కరెంటు వచ్చినా లో-వోల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన అన్నదాతలు.
కాంగ్రెస్ పాలనలపై రైతులు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగు,తాగు నీరు, కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. సాగుకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కరెంట్ సరఫరా చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >