Posted on 2025-08-06 14:02:41
డైలీ భారత్, జనగామ జిల్లా: కొడకండ్ల మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో కలిసి అమ్మవారికి బోనం ఎత్తి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరాధనా సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని,ఇలాంటి పండుగలు సాంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేస్తాయని, మహిళల భక్తి శ్రద్ధకు, సమాజంలో వారి పాత్రకు బోనాల పండుగ ప్రతిరూపమని ఝాన్సీరెడ్డి అన్నారు. వారి వెంట, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు శ్రీవర్ణ,మండల యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల యాకేష్ యాదవ్,మండల కాంగ్రెస్ నాయకులు అందే యాకయ్య, పసునూరి మధు, మహిళాలు యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >