Posted on 2025-07-26 09:41:32
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా... వారిని ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకన్న స్థానికులు పోలీసులు గాయపడినవారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులు ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నారు. వీరు పోలీసు డిపార్ట్మెంట్కు చెందిన స్కార్పియో వాహనంలో జయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే వారు ఓ కేసు విషయంలో హైదరాబాద్కు వస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏపీ హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి...
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించిన ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >