| Daily భారత్
Logo




నిజామాబాద్ లో దారుణం.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

News

Posted on 2025-07-18 19:56:57

Share: Share


నిజామాబాద్ లో దారుణం.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

యువకుడి కుటుంబానికి తెలియజేయకుండానే పోస్టుమార్టానికి తరలించిన వైనం..

హడావిడిగా పోస్టుమార్టం కు తరలింపులో కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఉందని కార్మిక సంఘాల ఆరోపణ..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ లో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భవనంలో టైల్స్ పాలిష్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా స్థానికంగా ఉండే ఓ ప్రజా ప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో హడావిడిగా కార్మికుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అయితే కార్మికుడు చనిపోయిన వెంటనే భవన యజమాని, కాంట్రాక్టర్ కార్మిక సంఘం తో మాట్లాడి మృతుని కుటుంబానికి ఎంతో కొంత ముట్ట చెప్పేందుకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.

దీనిపై వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆటోనగర్ కు చెందిన ఉమర్( 32) అనే కార్మికుడు మార్వాడి గల్లీ లో నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ లో పనిచేసేందుకు వచ్చాడు. టైల్స్ పాలిష్ పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని భవన యజమాని వెంటనే స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధికి తెలియజేశాడు. సదరు ప్రతినిధి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు. ఇదిలా ఉండగా కరెంట్ షాక్ తో మృతి చెందిన ఉమర్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోప్యంగా ఉంచడం పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భవన యజమానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేపట్టారు.

Image 1

మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు

Posted On 2026-01-16 20:39:04

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

Posted On 2026-01-16 19:08:48

Readmore >
Image 1

ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ

Posted On 2026-01-16 18:12:26

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

Posted On 2026-01-16 17:40:49

Readmore >
Image 1

ఐద్వా ముగ్గుతో జాతీయ మహాసభల ప్రచారం

Posted On 2026-01-16 16:40:56

Readmore >
Image 1

నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు

Posted On 2026-01-16 16:34:26

Readmore >
Image 1

కవితా శీర్షిక కనుమ

Posted On 2026-01-16 11:17:18

Readmore >
Image 1

సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

Posted On 2026-01-15 20:16:20

Readmore >
Image 1

పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

Posted On 2026-01-15 20:15:22

Readmore >
Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >