Posted on 2025-07-07 15:23:12
వచ్చింది డెలివరీ బాయ్ కాదు.. టెకీ స్నేహితుడే
ఆమె అనుమతితోనే ఇంటికి వచ్చిన స్నేహితుడు
స్ప్రే చల్లి మత్తులోకి నెట్టారన్న ఆరోపణలు కట్టుకథగా వెల్లడి
సెల్ఫీ, బెదిరింపు మెసేజ్లు.. అంతా యువతి సృష్టించిన నాటకమే
యువతిపై చర్యలు తప్పవన్న పోలీసులు
డైలీ భారత్, పూణే: పుణె నగరంలో తీవ్ర కలకలం రేపిన ఐటీ ఉద్యోగిని అత్యాచార కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యువతి చేసిన రేప్ ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉందని పోలీసులు తేల్చారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులోని గుట్టును రట్టు చేసి, అసలు నిజాలను బయటపెట్టారు.
వివరాల్లోకి వెళితే.. కొంధ్వా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిని తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెలివరీ ఏజెంట్ రూపంలో వచ్చిన ఓ వ్యక్తి, తనపై రసాయన స్ప్రే చల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెళ్లే ముందు తన ఫోన్తో సెల్ఫీ తీసుకుని, ఈ విషయం బయటపెడితే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపు సందేశం టైప్ చేశాడని కూడా తెలిపింది.
ఈ తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులకు.. ఆమె చెప్పిన కథనానికి, వాస్తవానికి పొంతన లేదని తేలింది. నిందితుడిగా చెప్పిన వ్యక్తి డెలివరీ ఏజెంట్ కాదని, ఆమెకు ముందే పరిచయమున్న స్నేహితుడని గుర్తించారు. ఆమె అనుమతితోనే అతను ఫ్లాట్కు వచ్చాడని, బలవంతంగా ఇంట్లోకి చొరబడలేదని నిర్ధారించారు.
ఈ విషయంపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ, "యువతి చేసిన ఫిర్యాదు పూర్తిగా కల్పితం. ఎలాంటి రసాయన స్ప్రే వాడలేదు, అత్యాచారం జరగలేదు. ఆమె స్నేహితుడు ఆమె సమ్మతంతోనే ఫ్లాట్కు వచ్చాడు. బెదిరింపు సందేశాన్ని యువతే స్వయంగా టైప్ చేసుకుంది" అని వెల్లడించారు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు యువతి విచారణలో చెప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పుణె నగర భద్రతపై తప్పుడు ప్రచారాలు జరిగాయని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >