Posted on 2025-07-07 20:41:49
త్వరలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తమ హక్కుల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తాం
వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: రాష్ట్రంలో రోజురోజుకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందుతున్నారని వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సూర్య వంశీ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్ విషయంలో 1000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించి ఇప్పుడేమో మోసం చేశారని విమర్శించారు. సోమవారం వికలాంగుల నవిపేట మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ విషయంలో న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో వికలాంగుల కొరకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించకపోవడం అన్యాయమన్నారు. అలాగే పెన్షన్ కూడా గత సర్కార్ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >