Posted on 2026-04-21 14:58:04
4 మందికి ఒక రోజు జైలు, 4 మందికి రెండు రోజుల జైలు శిక్షలు, మొత్తం ₹75,000/- జరిమానా విధింపు
ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే
క్షణికానందం కోసం సేవించిన మద్యం.. ఒకరి ప్రాణాన్ని తీస్తుంది, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపిఎస్ వెల్లడి
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిర్వహిస్తున్న డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 58 మందికి న్యాయస్థానం జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించింది. ఇందులో 4 మందికి ఒక రోజు జైలు శిక్ష, మరో 4 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మొత్తం ₹75,000/- జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
“ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే” అని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. “ప్రమాదం ముందస్తుగా చెప్పి రాదు” అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు.
మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని, క్షణికానందం కోసం చేసే తప్పు కుటుంబాలను చీకటిలోకి నెడుతుందని హెచ్చరించారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా మద్యం సేవించి వాహనం నడపవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >