Posted on 2026-04-21 13:38:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జనగణన 2027 లో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆఖరి రోజు శిక్షణ కొనసాగుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. జన గణనకు సంబంధించిన కిట్లను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మొదటి దశలో మే 11 వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027 లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి.. నమోదు చేయాలని ఆదేశించారు. అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ఎండాకాలం నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 26 వ తేదీన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ? చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఛార్జ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మహేష్ కుమార్, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
#sircilla #sircillacollector #garimaagrawal #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >