Posted on 2026-04-21 19:56:02
మాచారెడ్డి, కామారెడ్డి పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు: 9 మంది అరెస్ట్, నగదు మరియు వాహనాల స్వాధీనం
అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడును – జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో జూదం, పేకాట వంటి అక్రమ సామాజిక రుగ్మతలను రూపుమాపడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, మంగళవారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 9 మంది పేకాటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదుతో పాటు మొబైల్ ఫోన్లు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ తెలిపారు.
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చుక్కాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 3,750 నగదు, 4 మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 7,590 నగదు, 5 మొబైల్ ఫోన్లు మరియు ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఈ రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ:
“జూదం అనేది కేవలం ఒక ఆట కాదు, అది ఒక వ్యసనం. క్షణికమైన లాభం కోసం ఆశపడి కష్టార్జితాన్ని కోల్పోవడమే కాకుండా, మీపై ఆధారపడిన కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దు. పేకాట ఆడుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
గౌరవప్రదమైన సమాజంలో జూదానికి చోటు లేదని, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కితే జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమ పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగాo ఉంచుతాము” అని హామీ ఇచ్చారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >