Posted on 2026-04-21 16:23:11
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, జనగణన 2027లో భాగంగా స్వీయ ఎన్యూమరేషన్ (Self Enumeration - SE) సౌకర్యం 26-ఏప్రిల్-2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ సౌకర్యం ద్వారా ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ప్రక్రియ 10-మే -2026 వరకు కొనసాగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛందంగా స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొనవలసిందిగా మనవి చేయడమైనది.
స్వీయ ఎన్యూమరేషన్ ద్వారా:
-సమయం ఆదా అవుతుంది
-సమాచారం ఖచ్చితంగా నమోదు చేయబడుతుంది
-జనగణన ప్రక్రియ వేగవంతంగా పూర్తి అవుతుంది
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు మరియు ఐటీ రంగ ఉద్యోగులు, పట్టణ నివాస సంఘాలు తదితరులు ముందుండి పాల్గొని ఇతరులను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ప్రజలు అందరూ https://se.census.gov.in/ నిర్దేశిత వెబ్ పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన సహాయం కోసం కార్యాలయమును సంప్రదించవచ్చు.
జనగణన దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >