Posted on 2026-04-21 16:23:11
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, జనగణన 2027లో భాగంగా స్వీయ ఎన్యూమరేషన్ (Self Enumeration - SE) సౌకర్యం 26-ఏప్రిల్-2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ సౌకర్యం ద్వారా ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ప్రక్రియ 10-మే -2026 వరకు కొనసాగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛందంగా స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొనవలసిందిగా మనవి చేయడమైనది.
స్వీయ ఎన్యూమరేషన్ ద్వారా:
-సమయం ఆదా అవుతుంది
-సమాచారం ఖచ్చితంగా నమోదు చేయబడుతుంది
-జనగణన ప్రక్రియ వేగవంతంగా పూర్తి అవుతుంది
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు మరియు ఐటీ రంగ ఉద్యోగులు, పట్టణ నివాస సంఘాలు తదితరులు ముందుండి పాల్గొని ఇతరులను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ప్రజలు అందరూ https://se.census.gov.in/ నిర్దేశిత వెబ్ పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన సహాయం కోసం కార్యాలయమును సంప్రదించవచ్చు.
జనగణన దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >