Posted on 2026-04-21 12:56:27
డైలీ భారత్, స్పెషల్: ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం ఉదయ బానుడి తొలి కిరణాలతో భూమి తల్లి పండుగ మొదలవుతుంది…!
భూమి తల్లి కోసం
ఒక అడుగు ముందుకేస్తే చాలు
మన భవిష్యత్తు పచ్చగా మారుతుంది..!
జూట్ బ్యాగులు చేతిలో పట్టుకుని
పకృతి ప్లాస్టిక్ గాయాల్ని మాన్పుదాం..!
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ
పకృతి మాతకు స్వాగతం పలుకుదాం..!
ఒక చుక్క నీరు ఆదా చేస్తే
ఒక ప్రాణం కాపాడుతాం..!
చిన్న మొక్క నాటి పెంచితే
వందల మంది ప్రాణాలు కాపాడుతాం..!
పట్టణాల నల్లటి పొగమంచు పరుదా మాటున
నక్షత్రాలు చిక్కుకుపోయాయి...!
రాత్రి వేళల్లో వీధుల్లో మనిషి అరిచే వింత అరుపులకు పకృతి పాడే నిశీధి పాటలు వినిపించడం మానేశాయి...!
అభివృద్ధి అనే పేరుతో
ప్రకృతిని నశింపచేయకు…
చెట్లను నాటి మన భవిష్యత్తు పచ్చగా మార్చు..!
భూమి తల్లిని కాపాడి....
మన రేపటి దీపాల భవిష్యత్తు పచ్చగా మార్చు..!
సమస్త జీవరాశికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని ప్రసాదించే నేల తల్లికి వందనాలు! మట్టిని నమ్ముకున్న ప్రతి రైతుకు మరియు పచ్చని ప్రకృతిని ప్రేమిస్తున్న వారందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవం శుభాకాంక్షలు. మన భూమాతను కాపాడుకుందాం, పచ్చదనాన్ని పెంపొందిద్దాం.
రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >