| Daily భారత్
Logo




రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

News

Posted on 2025-07-02 08:38:17

Share: Share


రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

30 ఏళ్లుగా పరారీలో - రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

రాయచోటిలో చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు - 30 ఏళ్లుగా తప్పించుకుంటూ రాయచోటిలోనే మకాం

డైలీ భారత్, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ తెరవెనక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో గుర్తించింది.

ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్​కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూమున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు.

అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి.

సోదరులిద్దరిపై తమిళనాడులో పది వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. తమిళనాడు నుంచి తప్పించుకుని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఎవరికి అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకొని అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు.

అయితే తెరవెనక తీవ్రవాద చర్యలు బలంగానే చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలు గుర్తించాయి. రాయచోటిలో ఉన్నారని ఐబీ పక్కా సమాచారం సేకరించింది. వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు రెండు నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు. మారువేషాలతో తిరుగుతూ, చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు, వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు.

వీరి ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు తెలిసింది. కొన్ని పేలుడు పదార్థాల సామగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >