Posted on 2025-06-28 21:14:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదవశాత్తు గోడ కూలి నడుము మీద పడడంతో గుబ్బల సతీష్ వెన్నుపూస దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.
కుటుంబ పోషణకు ఆటోడ్రైవర్ వృత్తిగా జీవనం సాగిస్తున్న సతీష్ గత 15 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై అవస్థలు పడుతున్న దీన పరిస్థితి.
ఆర్థికంగా కుటుంబం నలిగిపోతుంది. వైద్యం, మెడిసిన్స్ కొరకు వేలాది రూపాయలు ఖర్చవుతుంది.
సతీష్ దీన పరిస్థితి కుటుంబ ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను గమనించిన గండికోట కిరణ్ గుబ్బల సతీష్ ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని నేనున్నానని ధైర్యం చెబుతూ.. సతీష్ కు ప్రతినెల వెయ్యి రూపాయలు మెడికల్ ఖర్చులకు అందజేస్తున్నారు.
ఈనేపథ్యంలో సతీష్ రెండు కాళ్లు తొలగించకుంటే ప్రాణాలకే ప్రమాదమని, హైదరాబాద్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.
సాయం చేయటానికి మంచి మనసుతో పాటు ఆర్థిక సాయం కూడా చేసే తత్వం ఉన్న కిరణ్ వారికి అండగా నిలిచి మెడికల్ ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
అంతేకాకుండా ఆపరేషన్ తరువాత గుబ్బల సతీష్ వారి కుటుంబ బతుకుతెరువు కోసం వ్యాపారం చేసుకుంటామని తెలిపారు.
ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయి ఇంతకన్నా మానవత్వం దైవత్వం మరొకటి లేదు అనే కొటేషన్లు చదువుకొని వదిలిపెట్టే వారే ఉన్న నేటి సమాజంలో అందుకు భిన్నంగా కిరణ్ కుమార్ గండికోట ఆచరణలో చేసి చూపుతున్నారు..
గుబ్బల సతీష్ కుటుంబం వ్యాపారం చేసుకోవడానికి అవసరమయ్యే పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో పట్టణంలోని పలువురు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గండికోట రీల్ హీరోల కంటే రియల్ హీరో అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >