Posted on 2026-06-06 15:17:24
డైలీ భారత్, కామారెడ్డి : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 99 రోజుల అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం నేడు కామారెడ్డి పట్టణంలోని లేబర్ అడ్డాలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది కార్మికులు పాల్గొని మహిళల భద్రత, బాలల సంక్షేమం మరియు సామాజిక బాధ్యతలపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా ఏహెచ్టీయూ అధికారులు మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాల దుష్పరిణామాలు, బాలల భద్రత, లింగ వివక్ష, లింగ పక్షపాతం, మహిళలపై హింస, సైబర్ నేరాలు, సైబర్ వేధింపులు, షీ టీమ్స్ సేవలు మరియు రోడ్డు భద్రత అంశాలపై సమగ్రంగా వివరించారు.
సమాజంలో ఎక్కడైనా మహిళలు, బాలలు లేదా సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు, వేధింపులు లేదా నేరాలు గుర్తించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1930 (సైబర్ హెల్ప్లైన్), 1098 (చైల్డ్ హెల్ప్లైన్) నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహిళలు, బాలలు మరియు బలహీన వర్గాల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏహెచ్టీయూ సిబ్బంది, కళాబృందం సభ్యులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే లేబర్ అడ్డా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాస్, డైలీ లేబర్ కార్మికులు మరియు స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >