Posted on 2025-06-25 10:01:32
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ ఆవరించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి సైతం ఆందోళనగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సజీవ దహనమైన మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అవి ఏ మాత్రం గుర్తు పట్టలేని విధంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని సైతం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధిత కుటుంబాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >