Posted on 2025-06-24 17:36:17
అదృశ్యమైన బాలుని కుటుంబ సభ్యులకి అప్పగించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై తోపాటు కానిస్టేబుల్ లను అభినందించిన సీఐ
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన మొహమ్మద్ తాజుద్దీన్ (8) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ అయినటువంటి బాబయ్య, రషీద్, సాయి విహార్, దినేష్ లను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు తో పాటు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం సేకరించి సిద్దిపేటలోని వారి నానమ్మ వద్ద ఉన్నట్లు సమాచారం తెలుసుకొని మంగళవారం మధ్యాహ్నం బాలుడుతోపాటు నానమ్మల ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అట్టి బాలుడిని సిడబ్ల్యుసి అధికారులకు అప్పగించినట్లు సిఐ వెల్లడించారు.
చాకచక్యంగా వ్యవహరించి 24 గంటలలోపే బాలుడి ఆచూకీ గుర్తించి కేసును చేదించినందుకు ఎస్ఐ రమాకాంత్ ను,నాలుగురు కానిస్టేబుల్ లను సిఐ అభినందించారు.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >