Posted on 2025-06-24 10:26:00
డైలీ భారత్, హైదరాబాద్: సాధారణంగా మనం హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఏదైన గొడవలు, ప్రమాదాలు మొదలైన ఘటనలు జరిగినప్పుడు చాలా మంది పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం.
ఈ క్రమంలో కొంత మంది వెరైటీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు ఇస్తుంటారు. కొంత మంది తమ పెంపుడు శునకం పోయిందని, తమ ఇంట్లోకి కోళ్లు ఎవరైన ఎత్తుకొని పోయారని కంప్లైంట్ లు ఇస్తుంటారు. ఇవి కూడా చూశాం. అయితే.. తాజాగా.. మాత్రం ఒక వెరైటీ పోలీసు కంప్లైట్ ఘటన వార్తలలో నిలిచింది. పోలీసులు కూడా ఈ ఫిర్యాదు విని అవాక్కైయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.
కూకట్పల్లిలో స్థానికంగా ఉండే.. ఒక వ్యక్తి తన దగ్గరగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి పాలప్యాకెట్ కొనుగోలు చేశారు. అతను ఇంటికి వెళ్లి వేడి చేయడానికి పెట్టాడు. కానీ ఆ పాలు అనూహ్యంగా విరిగిపోయాయి. దీంతో ఆగ్రహించిన అతను ఏకంగా రత్నదీప్ యాజమాన్యం దగ్గరకు వెళ్లి దీనిపై ప్రశ్నలు వేశాడు.
వారు మాత్రం నెగ్లీజెన్సీగా సమాధానం చెప్పారు. దీంతో అతను మరింత ఫ్రస్టేషన్ కు గురై.. దగ్గరలోని పీఎస్ కు వెళ్లి మరీ తన గొడును చెప్పుకున్నాడు. వెంటనే సూపర్ మార్కెట్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
చాలా సేపు బాధితుడికి పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మాత్రం.. మొండి పట్టుపట్డడంతో ఇక లాభంలేదని.. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. సూపర్ మార్కెట్ మేనేజర్పై కేసు నమోదు చేశారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >