Posted on 2025-06-24 13:56:00
డైలీ భారత్, హైదరాబాద్: సాధారణంగా మనం హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఏదైన గొడవలు, ప్రమాదాలు మొదలైన ఘటనలు జరిగినప్పుడు చాలా మంది పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం.
ఈ క్రమంలో కొంత మంది వెరైటీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు ఇస్తుంటారు. కొంత మంది తమ పెంపుడు శునకం పోయిందని, తమ ఇంట్లోకి కోళ్లు ఎవరైన ఎత్తుకొని పోయారని కంప్లైంట్ లు ఇస్తుంటారు. ఇవి కూడా చూశాం. అయితే.. తాజాగా.. మాత్రం ఒక వెరైటీ పోలీసు కంప్లైట్ ఘటన వార్తలలో నిలిచింది. పోలీసులు కూడా ఈ ఫిర్యాదు విని అవాక్కైయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.
కూకట్పల్లిలో స్థానికంగా ఉండే.. ఒక వ్యక్తి తన దగ్గరగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి పాలప్యాకెట్ కొనుగోలు చేశారు. అతను ఇంటికి వెళ్లి వేడి చేయడానికి పెట్టాడు. కానీ ఆ పాలు అనూహ్యంగా విరిగిపోయాయి. దీంతో ఆగ్రహించిన అతను ఏకంగా రత్నదీప్ యాజమాన్యం దగ్గరకు వెళ్లి దీనిపై ప్రశ్నలు వేశాడు.
వారు మాత్రం నెగ్లీజెన్సీగా సమాధానం చెప్పారు. దీంతో అతను మరింత ఫ్రస్టేషన్ కు గురై.. దగ్గరలోని పీఎస్ కు వెళ్లి మరీ తన గొడును చెప్పుకున్నాడు. వెంటనే సూపర్ మార్కెట్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
చాలా సేపు బాధితుడికి పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మాత్రం.. మొండి పట్టుపట్డడంతో ఇక లాభంలేదని.. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. సూపర్ మార్కెట్ మేనేజర్పై కేసు నమోదు చేశారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >