Posted on 2025-06-23 21:13:09
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: ఒకప్పుడు నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారలు వెలుగు చూసేవి.. ఇప్పుడు కాలం మారిపోయింది.. నిత్య పెళ్లి కూతుళ్లు కూడా చెలరేగిపోతున్నారు.. ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే స్కెచ్ వేసి మరి కాటికి పంపుతుండగా.. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు..
అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే.. వారిని పెళ్లి చేసుకోదండోయ్.. ఆమె, టార్గెట్ అంతా వేరు.. ఆమె వెనుక ఓ గ్యాంగ్ కూడా ఉందంటే నమ్మండి.. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తుందట.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ... ఇక, నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారం ఉందట.. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుని.. వారికి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ.. కొంత సమయం తీసుకుని.. ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తోంది.. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది.. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది.. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా..? నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.. తమకు జరిగిన అన్యాయాన్ని.. ఎలా మోస పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు...
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >