Posted on 2025-06-22 08:54:12
డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు చేరారు, ఇంకా ఎంత మంది చేరనున్నారు, ఏయే కళాశాలల్లో ఎంత మంది విద్యార్థుల సంఖ్య ఉంది, ఎంత మంది బోధనా సిబ్బంది ఉన్నారు, గురుకులాల్లో గత విద్యా సంవత్సరంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, జూనియర్ కళాశాలలకు సమీపంలో ఎన్ని గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, కళాశాలలకు బస్ సౌకర్యాలు ఉన్నాయా అని అధికారులు, ప్రిన్సిపాల్స్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలలకు సమీపంలో ఉన్న హాస్టల్స్ లో ఇంకా సీట్లు పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఏయే కళాశాలల్లో చేరారనే వివరాలను తనకు వారం రోజుల్లో నివేదికను అందజేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకూ 1867 ప్రవేశాల సంఖ్య నమోదైయిందన్నారు. ఇంకా నమోదు శాతం పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డిడి నిర్మల, ట్రైబల్ వెల్ఫేర్ డిడి ప్రేమ కళ, బీసీ వెల్ఫేర్ డిడి లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ ఎం ధరమ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >