| Daily భారత్
Logo




ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

News

Posted on 2025-06-22 08:54:12

Share: Share


ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

 శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 

 ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు చేరారు, ఇంకా ఎంత మంది చేరనున్నారు, ఏయే కళాశాలల్లో ఎంత మంది విద్యార్థుల సంఖ్య ఉంది, ఎంత మంది బోధనా సిబ్బంది ఉన్నారు, గురుకులాల్లో గత విద్యా సంవత్సరంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు,  జూనియర్ కళాశాలలకు సమీపంలో ఎన్ని గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, కళాశాలలకు బస్ సౌకర్యాలు ఉన్నాయా అని అధికారులు, ప్రిన్సిపాల్స్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

 ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండాలని అన్నారు.  విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలలకు సమీపంలో ఉన్న హాస్టల్స్ లో ఇంకా సీట్లు పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఏయే కళాశాలల్లో చేరారనే వివరాలను తనకు వారం రోజుల్లో నివేదికను అందజేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. 

ఈ సమావేశంలో  జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకూ 1867 ప్రవేశాల సంఖ్య నమోదైయిందన్నారు. ఇంకా నమోదు శాతం పెరుగుతుందన్నారు.

 ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డిడి నిర్మల, ట్రైబల్ వెల్ఫేర్ డిడి  ప్రేమ కళ, బీసీ వెల్ఫేర్ డిడి లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ ఎం ధరమ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >