Posted on 2025-06-22 10:52:22
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన వలస రమేశ్(45) నేత పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేండ్ల క్రితం కాలు విరగ్గా, వైద్యం కోసం అప్పుచేశాడు
అప్పటినుంచి ఆరోగ్యం సహకరించకపోవడం, పనిచేయలేని స్థితిలో ఉండటంతో మద్యానికి బానిసయ్యాడు. సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేయగా, అవి ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది శనివారం పట్టణంలోని కార్గిల్లేక్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >