Posted on 2025-06-20 20:48:06
రోజు రోజుకూ మృత్యు ఒడికి చేరుతున్న వైనం
ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయాన్ని అందించండి
అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్న నందిపాడు వాసి
అరు నెలలుగా కొనసాగుతున్న చికిత్స
దాతలు సాయం కోరుతున్న భార్య సమ్మక్క
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వేడుకుంటుంది. తన భర్తను కాపాడుకునేందుకు సాయం చేయాలంటూ ఆ రోగి భార్య సవలం సమ్మక్క కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం అశ్వారావుపేట మండలం, నందిపాడు గ్రామానికి చెందిన సవలం కాంతారావు (40) వ్యవసాయ కూలి అరు నెలల క్రితం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం, హైదరాబాద్ లోని హాస్పిటల్లో అరు నెలలుగా
చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పొలం భూమిని అమ్మేసి చికిత్స కోసం అప్పులు చేసి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, దాతలు ఆర్థిక సాయం చేస్తే తన భర్తను కాపాడుకుంటామని చేతులు జోడించి
అభ్యర్థిస్తున్నారు. సాయం చేయదలచిన దాతలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా నంబరు.. 35204450325 సవలం సమ్మక్క ,ఐఎఫ్ఎస్సీ కోడ్
ఎస్ బి ఐ ఎన్ 00 13326 లో 8500917079 (సవలం సౌజన్య నెంబరుకు ఫోన్పే ద్వారా జమచేయాలని భార్య దయ హృదయము గల వారిని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రజా ప్రతినిధులను రాజకీయ నాయకులను దాతలను దీన హృదయంతో అభ్యర్థిస్తోంది. దినపత్రికలో ప్రచురిస్తున్న ఈ న్యూస్ ను చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయని వారికి అందిస్తారని అభ్యర్థించడం జరుగుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >