Posted on 2025-06-20 11:16:51
డైలీ భారత్, ముంబై: రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక విదేశీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి ముంబైకి బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి కాపు కాచి చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు నైజీరియన్ మహిళను ఆపి ఆమె సామాను తనిఖీ చేశారు. ఆమె లగేజీని పరిశీలించిన తర్వాత, అధికారులు స్ఫటికాకార పదార్థపు ప్యాకెట్, ఇంకా మాత్రలు కలిగిన ఫుడ్ ప్యాకెట్లు (ఓట్స్), జ్యూస్ టెట్రా ప్యాక్లను స్వాధీనం చేసుకున్నారు
NDPS ఫీల్డ్ టెస్ట్ కిట్ని ఉపయోగించి ల్యాబ్స్లో పరీక్షలు చేయగా ఆ ప్యాకెట్లలో 2.56 కిలోగ్రాముల మెథాంఫేటమిన్, 584 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు ఉన్నట్టు నిర్ధారించారు. తదుపరి ఆపరేషన్లో సదరు సరుకును స్వీకరించాల్సిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ అక్రమ మాదకద్రవ్య మార్కెట్లో సుమారు రూ. 5 కోట్లుగా అంచనా వేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985లోని సంబంధిత నిబంధనల కింద సరుకు తీసుకోబోయే నైజీరియన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తదుపరి దర్యాప్తు జరుగుతోంది
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >