Posted on 2025-06-19 18:03:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఒక సమావేశంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ మండలం 1/70 యాక్ట్ అమల్లో ఉండగా మండలంలో గంటకొకటి పుట్టగొడుగుల ఫెర్టిలైజర్స్ షాపులు పుట్టుకొస్తున్నాయి వాటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన అమాయక గిరిజన రైతులు ఎంతో నష్టపోతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి జూలూరుపాడు మండలంలో ఉన్న దళిత గిరిజన పేద రైతులకు అత్యధిక పంట పండుతాయి అంటూ మాయ మాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమాయక గిరిజన రైతులకు అంటగట్టి పంట పండకపోవటంతో రైతులు ఆందోళన చెంది దళారులను అడగగా రైతులపై దాడులకు దళారులు పాల్పడుతూ ఎన్నో ఇబ్బందులకు పేద రైతులను గురి చేస్తున్నారు కావున తక్షణమే జూలూరుపాడు మండలంలో గిరిజనేతర్ల పేర్లపై ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల లైసెన్స్ లను తక్షణమే రద్దు చేసి 100కు 100% గిరిజనలే వ్యాపారం చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతారాం నాయక్, చరణ్ నాయక్, శివ నాయక్,వంశీ నాయక్ తదితరు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >