Posted on 2025-06-15 08:12:44
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి
TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభల ను జయప్రదంచేయయాలని కార్మికులకుTUCI భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు.
శనివారం జూలూరుపాడు లో కెజిబివి పాఠశాల వర్కర్స్ తో కలసి గోడపత్రికలను ఆవిష్కరించారు.అనంతరం గోపాలరావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ 21 22 తేదీ లో
నిజామబాద్ జిల్లా కేంద్రం లో జరుగుతున్నాయని జూన్ 21న భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నదని,ఈ బహిరంగ సభలో TUCI ఆల్ ఇండియా అధ్యక్షులు అమ్రిష్ పటేల్ పాల్గొని ప్రసంగిస్తారని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు .జులై 22న ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ ప్రతినిధుల మహాసభను ఉన్నత విద్య మండలి మాజీచైర్మన్ ఆహ్వానసంగం అధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రారంభిస్తారని వారు తెలిపారు
కస్తూరి భా పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్స్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపెట్టుతున్నాయని ఆరోపించారు.రూ.9700 లతో చాలీ చాలని జీతాల తో అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ. 26000.లు
ఇవ్వాలని గోపాలరావు డిమాండ్ చేసారు.
ఈ సభల్లో ముఖ్యంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా , కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేసే మోడీ ప్రభుత్వ
విధానాలకు వ్యతిరేకంగా, ఈ మాసభల్లో ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించటం జరుగుతుందని తెలిపారు. ఈ సభలకు తెలంగాణలో కెజిబివి, సింగరేణి, బీడీ, మున్సిపల్, భవన నిర్మాణరంగం, గ్రామపంచాయతీ మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, ఆశ, అంగన్వాడి, తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు , దేశంలో సంఘటిత అసంఘటిత రంగం హక్కులను హరించకపోతున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని వారి తరఫున టి యు సి ఐ పోరాడుతుందని కనీస వేతనాల చెల్లింపు చట్ట ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించవలసిన ప్రభుత్వాలు 12 సంవత్సరాలు నుంచి కనీస వేతనాలను జీవోలను విడుదల చేయకపోవడం దారుణమైన విషయమని వారు ఆరోపించారు, కనీస పెన్షన్ 9000 రూపాయలు నిర్ణయించాలని, జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో అరుణ,రమాదేవి, స్వరూప,నిర్మల, సునీత, కళ్యాణి శిరీష రజిత, స్రవంతి,రాధ తదితరులు పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >