| Daily భారత్
Logo




వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

News

Posted on 2025-06-03 18:31:37

Share: Share


వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్: వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల కోడెలు మృతిచెందాయి. ఈ సంఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఇచ్చిన కోడెలు మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. కోడెల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే కోడెలు మృతిచెందిన సంఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు.

ఇవాళ(మంగళవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తున్నామని వెల్లడించారు. పాత ఆలయం, పాత మండపాలు యధావిధిగా ఉంటాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొందని ఆది శ్రీనివాస్ తెలిపారు. పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి బీఆర్ఎస్ ఉండాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కేడర్‌ను మభ్య పెట్టేందుకే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి కాంగ్రెస్‌ని దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో హరీష్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీ ఇంటర్నల్ విషయాలు బయటకి చెప్పిన కవితపై చర్యలు తీసుకుంటారా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్‌కి అధికారం లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా చేయరా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.. KP

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >