Posted on 2025-05-30 19:40:17
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన చిప్పల విశాల్ గౌలీ దొడ్డి సీఈవో కళాశాలలో సీటు పొందడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 2025 SSC బ్యాచ్ లో 561 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు గ్రామానికి వన్నెతెచ్చాడని కొనియాడారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కళాశాల గౌలీదొడ్డి కళాశాల అలాంటి కళాశాలలో సీటు పొందడం అభినందనీయమన్నారు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఐఐటి సాధించడం చాలా సులువు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పల్లె స్నేహ తదితరులు అభినందించడం జరిగిందన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >