Posted on 2025-05-29 17:40:29
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంచే ఉపాధ్యాయ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు చక్కగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని డిజిటల్ సాధనాలతో సమ్మిళితం చేసుకుంటూ విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించి వారి అభ్యసనం సులభతరం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు అభ్యసించడానికి వస్తున్నారని వారి కోసం ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధిగా విధులు నిర్వహిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలని, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని పేర్కొంటూ బోధనా పద్ధతుల్లో డిజిటల్ వినియోగ మెలకువలు నేర్పించే ఈ శిక్షణ తరగతుల్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ కి మరియు ఈ శిక్షణా తరగతుల్లో రిసోర్స్ పర్సన్స్ గా విధులు నిర్వహిస్తున్న పోర్ల వేణుగోపాలరావు, శ్రీరాం మనోహర్, పర్కాల రవీందర్, అబ్దుల్ రవూఫ్ లను ప్రశంసిస్తూ సన్మానించారు.
శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కోర్స్ కోఆర్డినేటర్ శ్రీమతి శైలజ మరియు హిందీ విషయ ఉపాధ్యాయ శిక్షణా కేంద్ర అధికారి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డా. చకినాల శ్రీనివాస్ ను అభినందించి సత్కరించారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >