Posted on 2025-05-29 09:29:55
డైలీ భారత్, గుజరాత్: గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు మామూలు స్కెచ్ వేయలేదు. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు ఓ వృద్ధుడిని హత్య చేసి చివరికి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జఖోట్రాకు చెందిన వివాహిత గీతా అహిర్(22)కు భరత్ (21)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో వీరిద్దరూ దూరంగా వెళ్లి బతకాలని అనుకున్నారు. లేచిపోతే కచ్చింతగా దొరికిపోతామని గీత స్కెచ్ వేసింది. తెలుగుతో పాటుగా ఇతర బాషల్లో బాగా పాపులర్ అయిన దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుని తాను చనిపోయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేసి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది. ప్లాన్ ప్రకారం రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి భరత్ లిప్ట్ ఇచ్చాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు.
ఓ రాత్రి అతన్ని శవాన్ని చెరువు వద్దకు తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి పెట్రోల్ తీసుకుని బయటకు వచ్చిన గీత వృద్ధుడి మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి పెట్రోల్ తో తగలబెట్టారు. మర్నాడు ఉదయం సగం కాలిన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన భార్య కనిపించడం లేదంటూ గీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువు దగ్గర కనిపించిన ఓ శవానికి గీత దుస్తులు, పట్టీలు కనిపించడంతో అది చూసి గీత భర్త ఇది తన భార్య శవమేనని భావించారు. కానీ పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. రాజస్థాన్కు పారిపోయే ముందు పాలన్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ప్రేమ జంట పట్టుబడింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >