Posted on 2025-05-25 10:33:29
డైలీ భారత్, హైదరాబాద్: ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది 254 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది, ఉద్యోగుస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా కేంద్రం ఆమోదించింది.
2023 24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల 2024-25 సంవత్సరానికి EPFపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటు 2023-24 నాటి రేటుకు సమానం. ఈ వడ్డీరేటు పెంపు వల్ల 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది,
2024-25 ఆర్థిక సంవత్స రానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించిం ది. వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ EPF పై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది.
దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ EPFOకి పంపింది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా 2024-25కి వర్తిస్తుంది. తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2024న న్యూఢిల్లీలో జరిగిన 237వ EPFO సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో, 2024-25 సంవత్సరానికి వడ్డీ రేటును 8.25% వద్ద మార్చకుండా ఉంచాలనే ప్రతిపాదనను ఆమోదించా రు. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది.
ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు
Posted On 2026-03-04 14:16:32
Readmore >
ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Posted On 2026-03-04 06:20:57
Readmore >