| Daily భారత్
Logo




"విజయ సింధూరం"

Misc

Posted on 2025-05-09 07:26:04

Share: Share


"విజయ సింధూరం"

డైలీ భారత్, స్పెషల్ ఆర్టికల్:మతం పేరుతో దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏండ్లుగా భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్నీ విచ్ఛిన్నపరచడానికి కుట్రలు పన్నుతూ వచ్చింది.ఇటీవల పెహల్గాం లో జరిగిన దారుణ మారణ హోమానికి భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తో ధీటైన జవాబు ఇచ్చింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదని ఈ చర్య ద్వారా ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పింది. కొన్ని సంవత్సరాలుగా దాయాది దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నుండి వచ్చిన ఉగ్రవాదులు భారతదేశంలో ముంబై పేలుళ్లకి,పుల్వామా ఘటనకి, పెహల్గాం మారణకాండ కి కారణమయ్యాయని భారత ఇంటలిజెన్స్ విభాగం పాకిస్తాన్ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారతదేశంలో అనేక మారణ హోమాలకు కారణమైన ఉగ్రవాదులను తమకప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించిన దాయాది దేశం పట్టించుకోలేదు సరిగదా ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ వచ్చింది.

పెహల్గాం దుర్ఘటనకు ప్రతీకారంగా 7 మే 2025 న భారత త్రివిధ దళాలు 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.వీటిలో జైషే మహమ్మద్ లష్కరే తౌబా వంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. 

ఆపరేషన్ సింధూర్లో భాగంగా

భారత త్రివిధ దళాలు 

దాడి చేసిన 9 ఉగ్రవాద స్థావరాలు ఇవి...

1.ముజఫర్ రాబాద్ లోని సవాయినాలా. 2000 సంవత్సరం నుండి ఇక్కడ లష్కరితోయిబా క్యాంపు ఉంది. అబూ దుజాన ఈ క్యాంపు ఇన్చార్జి. పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం ఐఎస్ఐ కార్యకలాపాలు చురుగ్గా ఇక నుండి జరుగుతాయి. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబు ఈ స్థావరంలో శిక్షణ పొందారు. 

2.మస్కర్ రహీం షాహిద్ కోట్లీ లోఉంది ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ స్థావరం ఇది. పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇచ్చి, ఆయుధాలు, పేలుడు సామాగ్రి, ప్రచార సామాగ్రిని ఇక్కడ నిల్వ చేస్తారు. సయ్యద్ సలావుద్దీన్ దీనికి అధిపతి.

3. జైషై మహమ్మద్ స్థావరం బహావల్పూర్. జైషే మహమ్మద్ యొక్క ఆపరేషనల హెడ్ క్వార్టర్ ఇది. పుల్వామా దాడి సహా భారత్ పై చాలా కుట్రలకు ఇక్కడనుండే రూపకల్పన చేశారు. ఈ కేంద్రం నుంచే ఆత్మహత్య దాడులకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తారు.

4. మురిద్కె లష్కర్ క్యాంప్ కార్యాలయం ఇది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి ఉంటాయి .

82 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. దాదాపు 1000 మంది ఉగ్రవాదులకు ఇక్కడ ఉగ్ర శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఆల్కైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఈ శిక్షణ కేంద్రానికి 10 లక్షల విరాళం ఇచ్చాడు లష్కరే చీఫ్ హజీఫ్ సయీద్ ,జహీర్ రహ్మాన్, లక్వి లకు ఈ కేంద్రంలో ఇండ్లు కూడా ఉన్నాయి.

5. ముజఫారాబాద్ లోని సయ్యద్ నా బిలాల్ ఒక ఉగ్రస్థావరం. ఎస్ ఎస్ జి కమాండ్లతో ఇక్కడ శిక్షణ ఇస్తారు. దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉంటారని ఒక అంచనా. 

6. మర్కాజ్ అబ్బాస్ కోట్లి లో ఉంటుంది. 125 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి . హఫీజ్ అబ్దుల్ షకూర్ ఈ కేంద్రానికి ఇంచార్జ్. ఇతను జైషే మహమ్మద్  వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2023 లో పూంచ్ లో జరిగిన దాడులకు ఈ ఉగ్రవాద కేంద్రమే ప్రధాన కారణం. 

7. బర్నాల లోని మర్కాజ్ అహ్లే హదేత్ లష్కరే  ఉగ్రవాద శిబిరం ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ కాసిం గుజ్జర్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగిస్తున్నారు. 

8. సియాల్ కోటు లోని మెహబూనాజోయ విజిబుల్ ముజాహిద్దీన్ శిబిరం.1995లో జమ్ములో మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకి ఇక్కడ నుండే రూపకల్పన చేశారు. 

9. తెహరా కలాన్ లోని సర్జలు ఉగ్రవాద స్థావరం. జమ్మూ కాశ్మీర్ లోకి ఉగ్రవాదులను స్వరంగ మార్గాల ద్వారా ఈ కేంద్రం నుండి పంపిస్తారు. భారతదేశంలోకి ఆయుధాలు, మత్తు పదార్థాల అక్రమరవాణా చేసినందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు కమ్యూనికేషన్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి పటాన్ కోట్ వైమానిక స్థావరం పై దాడి చేసిన ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. 

ఇవన్నీ ఉగ్ర కేంద్రాలు ఇక్కడ ఉండేదంతా కరడు కట్టిన ఉగ్రవాదులే,వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఆయుధాలతో భారత్ పై దాడిచేయడమే ఈ ఉగ్రవాదుల పని.

ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రహల్గంలో చనిపోయిన అమాయకులకు భారత సైన్యం జోహార్లు అర్పించింది.ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. భారత్ ఆపరేషన్ సింధూర్ కు బెంబేలెత్తిపోయింది పాకిస్తాన్.

దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఎంతోమంది సైనికుల ప్రాణాలు బలిగొందని తద్వారా వారి భార్యలు సింధూరం కోల్పోవాల్సి వచ్చిందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు.ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు గానీ పాకిస్తానీ పౌరులపై దాడి చేయకపోవడం గమనార్ధం. భారత దేశ లక్ష్యం ఉగ్రవాదంన్నీ రూపుమాపడమే తప్ప,అమాయక ప్రజలను హతమార్చడం కాదని స్పష్టంగా తెలియజేస్తుంది.

మే 7వ తేదీ ఉదయం 1:30 కి భారత దేశ త్రివిధ దళాలు సమన్వయంతో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ముష్కరులను స్థావరాలను ధ్వంసం చేశాయి అనధికార సమాచారం మేరకు దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించారని తెలుస్తుంది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతదేశం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇలా దాడి చేయడం ఇదే మొదటిసారి.

ప్రపంచ శాంతికాముక దేశంగా ఉన్న భారతదేశం తమ దేశ సమగ్రతకి ముప్పు వాటిల్లినప్పుడు భారతీయులు అందరు ఏకమై ముక్తసరిగా ఒకటవుతారని ఆ దిశగా భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యల కైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని దేశంలోని రాజకీయ పార్టీలు పార్టీలకతీతంగా కుల మత వర్గ విభేదాలను పక్కన పెట్టి ఉగ్రవాదంపై దాడి చేయడంలో ఏకమవుతాయని ఈ ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పింది. 

దౌత్య విజయం..

పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై ప్రపంచ  దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. భద్రతామండలి

సమావేశం లో అమాయకత్వం నటించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న పాకిస్తాన్ కోరిక మేరకు ప్రత్యేక భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ సమావేశంలో సభ్య దేశాలు ప్రశ్నించిన విధానానికి పాకిస్తాన్ కు ముచ్చటలు పట్టాయి.భారత్ కుట్ర పన్ని తనకు తానే ప్రహల్గాం దాడి చేసుకుని పాకుపై నిందలు తానే మోపుతుందని దారుణ వాదనను సభ్య దేశాలు తోసిపచ్చాయి. పెహల్గామ్ దాడిలో లష్కరి తొయుబ

 పాత్రను  సభ్య దేశాలు ప్రశ్నించాయి.

మతం ఆధారంగా అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి .

భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపని పరీక్షలు నిర్వహించడం పైకూడా భద్రతా మండలి నిలదీసింది. భద్రతా మండలి లోని సభ్య దేశాలన్నీ కూడా ఉగ్రవాద దాడిని ఖండించాలని పాకిస్తాన్ కు హితవు పలికాయి .పాకిస్తాన్ కు తమ సహాయం ఉండదని భేషరతుగా ప్రకటించాయి. దీనితో పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి తలంటించుకున్నట్టయింది. 

భారత్ తో ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కరించుకోవాలని భద్రతామండలి పాకిస్తాన్ కు సూచించింది. దౌత్యపరంగా భారతదేశ అనుసరించిన విధానం వల్ల భద్రతా మండలి లోని సభ్య దేశాలు భారత్ కి అండగా నిలిచాయి. ఇది ముమ్మాటికి భారత ప్రభుత్వ దౌత్య విజయమే. ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలు భారత్ కు మద్దతుగా నిలవడం పూర్తిగా దౌత్య విజయం.

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ పాత వీడియోలతో సోషల్ మీడియాలో భారత సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది .వీటిని ఫ్యాక్ట్ చెక్ చేసిన భారత ప్రభుత్వం ఇవన్నీ పాత వీడియోలని ప్రకటించింది. దాయాది దుర్నీతిని ప్రపంచానికి చాటి చెప్పింది.

భారత భూభాగం నుంచి గగనతలం నుంచి మాత్రమే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి జరిగింది భారత దళాలు ఎంచుకున్న లక్ష్యం పూర్తయింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పెహల్గాం మారణ హోమంలో మరణించిన అమాయకులకు న్యాయం జరిగింది.

ప్రహల్గాం దుర్ఘటన తర్వాత భారత ప్రభుత్వం శీఘ్రగతిన నదీజలాల కట్టడి, పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపడం, పాకిస్తాన్ ఛానల్ లను నిషేధించడం,పాక్ ఉగ్రవాద మూలాలపై దెబ్బ కొట్టడం,పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం వంటి చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకి ప్రపంచ దేశాల్లో మద్దతు కూడగట్టడంలో ప్రపంచ పటంలో భారత్ ని ఏకాకి చేయడంలో భారత ప్రభుత్వం సఫలీకృతమైంది.

ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపడంలో ఆపరేషన్ సింధూర్ నాంది మాత్రమే, దీనికి కొనసాగింపుగా దేశ సమగ్రత కై భారత ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు దేశంలోని ప్రతి పౌరుడు కుల మత వర్గ విభేదాలను పక్కనపెట్టి, పార్టీలకతీతంగా మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలియజేస్తూ స్వచ్ఛందంగా పాల్గొని భారతదేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా పోరాడాల్సిన అవసరం ఉంది.

జై జవాన్ ...జై భారత్...జై హింద్...

హాట్సాఫ్ టు ద ఇండియన్ ఆర్మీ...🫡


పాకాల శంకర్ గౌడ్ 

9848377734.

Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

Posted On 2025-05-22 05:22:13

Readmore >
Image 1

దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2025-05-21 17:29:16

Readmore >
Image 1

ఏసీబీ వలలో మిషన్ భగీరథ అధికారి

Posted On 2025-05-21 17:28:14

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

Posted On 2025-05-21 17:23:28

Readmore >
Image 1

వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం

Posted On 2025-05-21 08:57:24

Readmore >
Image 1

కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

Posted On 2025-05-20 07:26:00

Readmore >
Image 1

చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

Posted On 2025-05-20 07:24:46

Readmore >
Image 1

అల్లుడిని చంపిన కేసులో నిందితుల అరెస్ట్

Posted On 2025-05-20 07:23:32

Readmore >
Image 1

పోస్టర్ ఆవిష్కరణ

Posted On 2025-05-19 14:30:53

Readmore >
Image 1

లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం

Posted On 2025-05-18 16:45:45

Readmore >