Posted on 2026-04-27 17:07:27
డైలీ భారత్, హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారని తెలిపేందుకు చింతిస్తున్నాము.
ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను గతంలో ఆయన నిర్వహించారు.
విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య,ఒక కుమారుడు ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారు.
మారబోయిన మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.వృత్తిపట్ల అద్దం అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >