| Daily భారత్
Logo




మాజీ డిజిపి దారుణ హత్య?

News

Posted on 2025-04-20 22:49:29

Share: Share


మాజీ డిజిపి దారుణ హత్య?

డైలీ భారత్, బెంగళూరు: కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కర్ణాటక డీజీపీగా, ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓంప్రకాష్.. అతని ఇంట్లో శవమై కనిపించారు. 

బెంగళూరులోని హెచ్ఎస్ ఆర్ లేఅవుట్లో‌ని ఆయన నివాసంలో ఓంప్రకాష్ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓంప్రకాష్ హత్య కేసులో ఆయన భార్యను ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్నారు. ఓం ప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయా నంద ధ్రువీకరించారు.

రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ, భార్యపైనే అనుమానాలు!

ఓం ప్రకాష్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో బెంగళూరు లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది. 

ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్‌ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తు న్నారు. ఓం ప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు తెలి సింది. అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడలేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. 

పూర్తి సమాచారం అందిన తర్వాత ఓం ప్రకాష్ మృతిపై మాట్లాడతామని చెప్తున్నారు.మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకు ముందు ఓ వాట్సప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నా డని.. తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడని అందులో ఓంప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం, 

అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. దీనిపైనా పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఓం ప్రకాష్ భార్యను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >