Posted on 2025-04-19 00:29:08
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అరుణాచలంలో రమణాశ్రమానికి ఎదురుగా ఉన్న ఈ గణపతి ఆలయం మధ్యలో ఉన్న అరుగుకు ఒక విశేషం ఉన్నది..1907 ప్రాంతంలో కావ్యకంఠ గణపతి ముని, వారి తమ్ముడు ఒక ఏకాదశి నాడు ఆకలి బాధతో ఎందరో ఇళ్ళకు వెళ్ళి అన్నం పెట్టమని అడుగగా, ఉపవాసం వల్ల ఎవ్వరూ పెట్టలేకపోతారు. చివరకు వారి తమ్ముడు కడుపు నొప్పితో చుట్టుకుపోతుంటే, ఒక ఇంటి అరుగు మీద పడుకోబెడతారు. ఆ ఇంటాయన సుందరేశ్వరుడు ఏకాదశి నాడు ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టే నియమం వారికి ఉన్నదని, వీరిని భోజనానికి ఆ ఇంట్లోకి తీసుకెళ్తారు. లోపల నుండి వారి ధర్మపత్ని మీనాక్షి పేరుతో వచ్చి, నవకాయ పిండివంటలతో కడుపునిండా భోజనం పెట్టీ, అరుగు మీద పడుకోమని చెప్పి, స్వయంగా తమలపాకులు, వక్క కూడా ఇస్తుంది..
అవి తిని, ఇంతటి మధుర భోజనం మునుపెన్నడూ తినలేదని ఆలోచిస్తూ గాడ నిద్రలోకి జారుకుంటారు. ఉదయం మెలుకువ వచ్చేసరికి అక్కడ తమలపాకు తొడిమెలు ఉంటాయి కానీ ఆ దంపతులు ఉండరు. పైగా ఆ ఇల్లు ఒక గణపతి ఆలయంగా మారిపోయి ఉంటుంది..
సాక్షాత్ ఆ శివ పార్వతులు మీనాక్షి సుందరేశ్వర పేర్లతో వారి బిడ్డల ఆకలి తీర్చిన సంఘటనకు ప్రత్యక్ష నిదర్శనం ఈ గణపతి మండపం..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >